పశుగ్రాసాలు, పాడి పరిశ్రమాభివృద్ధికి పునాది. పాడిపరిశ్రమపై ఆధారపడే ప్రతి పాడి రైతు పచ్చిమేత తప్పని సరిగా సాగుచేసుకోవాలి. తమకున్న భూమిలో కనీసం 10వ వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశుగ్రాసాల రకాలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు- ధాన్యపు జాతి, పప్పుజాతి, గడ్డి జాతి, చెట్టు జాతి
ఈ పశుగ్రసాల్లో పంటకాలాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటాయి. ఏకవార్షిక మరియు బహువార్షిక. ఏకవార్షిక పశుగ్రాసం ఒక సంవత్సర కాలంలో పంట పూర్తయి పశుగ్రాస దిగుబడి 3-4 కోతలు వస్తుంది. దీనికి వ్యతిరేకంగా బహువార్షిక పశుగ్రాసాలు ఒకసారి నాటితే 5-6 సంవత్సరాల పాటు పలుకోతల్లో పశుగ్రాస దిగుబడి వస్తుంది. నీటిపారుదల సౌకర్యం ఉన్న సందరాÄ్భల్లో బహువార్షిక పశుగ్రాసం సాగు చేసుకోవచ్చు.
జొన్నని ముఖ్యంగా ధాన్యం కోసం మరియు పశుగ్రాసం కోసం సాగు చేస్తారు. ఇది కరువు తట్టుకునే రకం.
ఏకవార్షిక (ఖరీఫ్) : పూసాచరిహైబ్రీడ్-106, హర్యానాజోవార్-513, పంత్చరి-4
బహువార్షిక : పూసాచరి-615, పంత్చరి-6, కో.ఎఫ్.ఎస్.29, కో.ఎఫ్.ఎస్.31
అనువైన భూములు : మెట్ట ప్రాంతాలు మరియు నీరు నిల్వ చేసే పల్లపు భూములు తప్ప అన్నిరకాల నేలలో సాగు చేయవచ్చు.
హెక్టారుకు విత్తనం మోతాదు : ఏకవార్షిక రకాలుకి 10 కిలోలు మరియు బహువార్షిక రకాలకి 25 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.
సాగు పద్ధతి : ఏకవార్షిక రకాలు సాగు చేయటానికి మొక్కల మధ్య ఒక అడుగు దూరం ఉండాలి మరియు బహువార్షిక రకాలు మొక్కల మధ్య 1.5 అడుగు దూరం ఉండాలి.
ఒక హెక్టరకు 100 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం మరియు ప్రతి కోత తరువాత 50 కిలోల నత్రజని అవసరం అవుతుంది.
వేసవిలో వారంలో 1-2 సార్లు తడిపెట్టాలి
ఏకవార్షిక రకాల్ని నాటిన 60-65 రోజుల తరవాత (50% పూత దశలో) కోయవచ్చు. బహువార్షిక రకాల్ని నాటిన 60 రోజుల తర్వాత కోయాలి. తదుపరి కోతలు ప్రతి 45 రోజుల తర్వాత తీసుకోవాలి.
6-7 కోతలు
ఒక ఎకరానికి 70-80 టన్నులు దిగుబడి పొందవచ్చు.
అలసంద మరియు పిల్లి పెసరలను మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది. జొన్నని ఎండు చొప్ప మరియు పాతరగడ్డి (సైలేజి) తయారీలో కూడా వాడతారు.
జొన్నలో 8.5-10 శాతం మాంసకత్తులు మరియు 19.8-25.6 శాతం పీచు పదార్ధాలు కలిగి ఉంటాయి.
మొక్కజొన్న ఏకవార్షిక పంట. ఇది కరువు తట్టుకునే రకం. నీటిపారుదల సౌకర్యం ఉంటే సంవత్సరం పొడువునా పెరుగుతుంది.
రకాలు : ఆఫ్రికన్ టాల్, విజయ్, మౌతి, గంగ-5, జవహర్, ఏ.పి.ఎఫ్.ఎమ్.-8
అనువైన భూములు : ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలలు, చౌడు నేలలు, నీరు నిలిచే నేలలు పనికి రావు.
హెక్టారుకు విత్తనం మోతాదు : 8 కిలోలు అవసరం.
విత్తనాన్ని 5 సెం.మీ. దూరంలో విత్తాలి. మొక్కల మధ్య 75 18 సెం.మీ. దూరం లేదా 60-22 సెం.మీ ఉండాలి.
ఒక హెక్టారకు 60-120 కిలోల నత్రజని, 40-60 కిలోల భాస్వరం, 40-60 కిలోల పోటాష్, 20 కిలోల జింక్ అవసరం.
నాటిన వెంటనే నీరు పెట్టాలి. వారంలో 3-4 సార్లు తడి పెట్టాలి.
విత్తిన 60-70 రోజులు తరవాత కోత తీసుకోవచ్చు.
ఆఫ్రికన్ టాల్ ఒక ఎకరానికి 24-28 టన్నులు దిగుబడిని ఇస్తుంది.
అలసంద మరియు పిల్లి పెసరలను మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది. మొక్కజొన్నని ఎండు చొప్ప, పాతరగడ్డి (సైలేజి) తయారీలో కూడా వాడతారు.
మొక్కజొన్నలో 50 శాతం పిండి పదార్థాలు, 8-10 శాతం మాంసకత్తులు మరియు 38 శాతం పీచు పదార్ధాలు కలిగిఉంటాయి.
సజ్జ కరువు మరియు అధిక ఉష్ణోగ్రతని తట్టుకుని తక్కువ సారవంతమైన నేలలో కూడా సహజంగా పెరుగుతుంది.
రకాలు : ప్రోఅగ్రో, ఏ.పి.ఎఫ్.బి.-2, కో-8, అవికా బజారాచారి, ఎఫ్.బి.సి-16
అనువైన భూములు : అన్ని రకాల నేలలు సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా ఇసుక మరియు చవుడు నేలలు అనువైనవి.
హెక్టారుకు విత్తనం మోతాదు : 5 కిలోల విత్తనాలు అవసరమైతాయి.
సజ్జ పశుగ్రాసం సాగు చేసినప్పుడు సాళ్ల మధ్య 1.5 అడుగులు దూరం ఉండాలి మరియు రెండు మొక్కలు మధ్య 0.5 అడుగు దూరం ఉండాలి.
ఒక హెక్టరకు 8-10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 20 కిలోల జింక్ సల్ఫేట్ అవసరం.
నీటి తడి : వారంలో ఒక సారి తడి పెట్టాలి.
విత్తిన 50-55 రోజుల్లో కోతకి అనువుగా ఉంటుంది.
ప్రోఅగ్రో (మల్టీకెట్) రకం ఎకరానికి 30 టన్నుల దిగుబడి ఇస్తుంది.
అలసంద మరియు పిల్లి పెసరలను మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది.
సజ్జలో 2.5-5 శాతం మాంసకత్తులు మరియు 36 శాతం పీచు పదార్ధాలు కలిగి ఉంటాయి.
పప్పుజాతి పశుగ్రాసాలు
అలసంద ఏకవార్షిక పంట. ఇది ఏడాది పొడవునా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
రకాలు : యూ.పి.సి.-625, కో (ఎఫ్.సి) 8, రష్యన్జైంట్, ఈ.సి.4216
అనువైన భూములు : అన్ని రకాల నీరు నిలవని భూముల్లో సాగు చేయవచ్చు.
హెక్టారుకు విత్తనం మోతాదు : 20-25 కిిలోల విత్తనాలు అవసరం.
సాగు పద్ధతి : అలసంద సాగు చేయటానికి సాళ్ల మధ్య 1-1.5 అడుగుల దూరం ఉండాలి.
ఒక హెక్టారకు 120 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం కావాలి.
15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.
విత్తిన 80-85 రోజుల్లో కోతకి వస్తుంది.
యూ.పి.సి.625 రకం ఒక హెక్టారుకి 35-40 టన్నుల దిగుబడి ఇస్తుంది.
చలికాలంలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పంట 50 శాతం పూత దశలో ఉన్నప్పుడు కోయాలి.
అలసంద పశుగ్రాసంలో 15-17 శాతం మాంసకత్తులు మరియు 36 శాతం పీచు పదార్ధాలు ఉంటాయి.
పిల్లి పెసర అలసంద ఏకవార్షిక పంట.
అన్నిరకాల తేమగల భూమిలో సాగు చేయవచ్చు.
30-40 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.
నాటేటప్పుడు రెండు సాళ్ల మధ్య 0.5 అడుగుల దూరం ఉండాలి.
ఒక హెక్టారకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియ అవసరం అవుతాయి.
15 రోజుల్లో ఒకసారి తడిపెట్టాలి.
విత్తిన 50-60 రోజుల్లో కోత తీసుకోవాలి.
ఒక హెక్టారకు 10-15 టన్నుల దిగుబడి పొందవచ్చు.
పంట 50 శాతం పూతదశలో ఉన్నప్పుడు కోయాలి.
పిల్లి పెసరలో 15-17 శాతం మాంసకత్తులు మరియు 60 శాతం పిండి పదార్థాలు ఉంటాయి.
బర్సీం చలికాలంలో సాగు చేసే పప్పు జాతి పశుగ్రాసం.
రకాలు : బి.ఎల్.-180 హెచ్.ఎఫ్.బి.-600, జె.బి.-5
అనువైన భూములు : ఇసుక నేలలో తప్ప అన్ని రకాల నేలలో సాగు చేయవచ్చు. నీటి పారుదల ఉన్న, కాల్షియం మరియు భాస్వరం అధికంగా లభ్యమయ్యే రేగడి నేలలు సాగుకి అనుకూలమైనవి.
హెక్టారుకు విత్తనం మోతాదు : 25 కిలోలు విత్తనాల్ని వెదజల్లి సాగు చేసుకోవాలి.
ఒక హెక్టారకు 20 టన్నుల పచ్చి రొట్ట లేదా పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని మరియు 80 కిలోల భాస్వరం అవసరం అవుతాయి.
15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.
విత్తనం నాటిన 50 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. తదుపరి పెరుగుదలను బట్టి 5-6 సార్లు కోత తీసుకోవచ్చు.
ఒక హెక్టారకు 80 టన్నుల దిగుబడి పొందవచ్చు.
నాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే తెగుళ్ళు నివారణ చేయవచ్చు మరియు ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
బర్సీం పశుగ్రాసంలో 20 శాతం మాంసకత్తులు మరియు 62 శాతం పిండి పదార్థాలు ఉంటాయి.
ఇది వేసవి కాలంలో సాగు చేసే బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసం. ఇది కరువు తట్టుకునే రకం.
రకాలు : స్టైలోసన్తేసూక్రాంతి, స్టైలోసన్తేస్స్కేబరా
అనువైన భూములు : అన్ని రకాల నేలలో సాగు చేయవచ్చు.
హెక్టారుకు విత్తనం మోతాదు : 5-6 కిలోల విత్తనాల్ని వెదజల్లాలి.
మొదటి సంవత్సరంలో ఒక హెక్టారకు 120 కిలోల పోటాష్ మరియు 40 కిలోల నత్రజని ప్రతి సంవత్సరం అవసరం.
15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.
విత్తిన 65-70 రోజుల్లో కోత తీసుకోవచ్చు.
ఒక హెక్టారుకి 25-30 టన్నుల దిగుబడి పొందవచ్చు. మొదటి సంవత్సరంలో పెరుగుదల తక్కువగా ఉండటం వల్ల దిగుబడి తక్కువగా ఉంటుంది.
పంట పూతదశలో ఉన్నప్పుడుకోయాలి. ఒకసారిసాగు చేస్తే 4-5 సంవత్సరాల వరకు పశుగ్రాసం లభిస్తుంది.
స్టైలో పశుగ్రాసంలో 15-18 శాతం మాంసకత్తులు మరియు 60 శాతం పిండి పదార్థాలు ఉంటాయి.
లుసర్న్ వేరులు లోతుగా ఉంటాయి. ఇది బహువార్షిక పశుగ్రాసం. ఇది అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే రకం.
రకాలు : ఆనందు లుసర్న్-3, ఆర్.ఎల్.-88, కో-1, ఎల్.ఎల్. కంపోసిట్-3
అనువైన భూములు : సారవంతమైన మరియు నీరు నిలువని భూములు లుసర్న్ సాగుకి అనువైనవి.
హెక్టారుకు విత్తనం మోతాదు : వెదజల్లే విధానంలో 20-25 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.
మొదటి సంవత్సరంలో ఒక హెక్టారకు పచ్చి రొట్ట ఎరువు 20-25 టన్నులు, 120 కిలోల భాస్వరం మరియు 20 కిలోల నత్రజని అవసరం. తదుపరి ప్రతి సంవత్సరం 40 కిలోల పొటాష్ మరియు 80 కిలోల భాస్వరం అవసరం అవుతాయి.
నాటిన కొత్తలో వారానికి ఒక సారి తడి పెట్టాలి. తదుపరి 15 రోజుల్లో ఒక సారి తడి పెట్టాలి.
విత్తిన 55-60 రోజుల్లో కోత తీసుకోవచ్చు.
ఒక హెక్టారకు 70-90 టన్నుల దిగుబడి పొందవచ్చు. మొదటి సంవత్సరంలో పెరుగుదల తక్కువగా ఉండటంవల్ల దిగుబడి తక్కువ ఉంటుంది.
ఒక సారి సాగుచేస్తే 3-4 సంవత్సరాల వరకు పశుగ్రాసం లభిస్తుంది.
లుసర్న్లో 16-25 శాతం మాంసకత్తులు, 20-30 శాతం పీచు పదార్థాలు మరియు విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది.
డా|| పి.మంజరి, శాస్త్రవేత్త, పశువైద్య విభాగం - కె.వి.కె., పెరియవరం, డా|| ఎల్. రంజిత్ కుమార్, శాస్త్రవేత్త, కీటకశాస్త్ర విభాగం - కె.వి.కె., పెరియవరం,
ఎన్. శ్రీ విద్యా రాణి, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం - కె.వి.కె., పందిరిమామిడి, చె. సింధు, రీసెర్చ్ అసోసియేట్, గహ విజ్ఞాన విభాగం - కె.వి.కె., పెరియవరం,
డి. వినోద్ నాయక్, రీసెర్చ్ అసోసియేట్, విస్తరణ విభాగం - కె.వి.కె., పెరియవరం