వేరుశనగ పై వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు వివిధ దశల్లో ఆశించి నష్టం కలుగజేస్తాయి. నీటి పారుదల క్రింద సాగుచేసే వేరుశనగలో ముఖ్యంగా పొగాకు లద్దెపురుగు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళ సమస్య అధికంగా ఉంటుంది. అంతేగాక రబీ వేరుశనగలో ఇనుప ధాతు లోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇనుప ధాతు లోపం ఉన్నప్పుడు లేత ఆకులు మొదటగా పసుపు పచ్చగా తరువాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపం గమనించినప్పుడు ఎకరాకు ఒక కిలో అన్నభేది (ఐరన్ సల్ఫేట్) మరియు 200 గ్రా. సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపుగా గుడ్లను పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు ఆకులపై పత్ర హరితాన్ని గోకివేసి జల్లెడలాగా మారుస్తాయి. పెద్ద పురుగులు ఆకులను పూర్తిగా తినేేస్తాయి. ఇవి పగలు చెట్ల క్రింద, రాళ్ళు, మట్టి పెళ్ళల అడుగు భాగాన ఉండి, రాత్రుళ్ళు పంట నష్టం కల్గిస్తాయి. పిల్ల పురుగులు గమనించినప్పుడు 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పెద్ద పురుగులను గమనించినప్పుడు విషపు ఎరను (వరి తవుడు 5 కిలోలు, బెల్లం అర కిలో మరియు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ కలిపి) తయారు చేసి, చిన్న ఉండలుగా చేసుకుని, ఎకరా పొలంలో సాయంత్రం పూట చల్లాలి. లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా రినాక్సిపైర్ 0.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పచ్చ పురుగు పూర్తిగా విచ్చుకోని ఆకులను తినడం వల్ల, ఆ ఆకులు విచ్చుకున్న తరువాత నాలుగు ఆకుల్లోనూ ఒకేచోట రంధ్రాలు గమనించవచ్చు. ఈ పురుగును గమనించినప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా రినాక్సిపైర్ 0.25 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ పురుగులు నలుపు రంగులో ఉండి, మొక్కల కొమ్మల చివర్ల పైన, లేత ఆకుల అడుగు భాగాన, పూతపై గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల పూత రాలడం, మొక్కలు గిడసబారడం గమనించవచ్చు.
ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల మొదట ఆకు పైభాగాన నిహకు ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి, క్రమేపి ఆకులన్నీ పసుపుపచ్చగా మారుతాయి.
ఈ రసం పీల్చు పురుగులను గమనించినప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ తెగులు ఆశించినపుడు విత్తనం మొలకెత్తిన తరువాత కాండంపైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. భూమి దగ్గర ఉండే కాండం మీద మచ్చలు ఏర్పడి, క్రమంగా పైకి వ్యాపిస్తాయి. తెగులు ఆశించిన మొక్కలు వడలిపోయి, చనిపోతాయి. దీని నివారణకు విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రా. టిబుకొనజోల్ 2 డి.యస్ లేక 3 గ్రా. మాంకోజేబ్ చొప్పున కలిపి విత్తనశుద్ది చేయాలి. తెగులు ఆశించిన వెంటనే ఎకరాకు 400 గ్రా. మాంకోజేబ్ మందును 200 గ్రా. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ తెగులు ఆశించినపుడు మొవ్వు ఎండిపోయి, మొక్కలు కురచబడి, ఎక్కువ రెమ్మలు వస్తాయి. లేత దశలో ఆశిస్తే కాయలు ఏర్పడవు. ఇది తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఇటువంటి మొక్కలను గమనించినప్పుడు వాటిని పీకివేసి, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నివారణకు విత్తనశుద్ది తప్పని సరిగా చేయాలి.
ఈ తెగులు విత్తిన 70 రోజుల నుండి ఆశిస్తుంది. తొలుత తెగులు ఆశించినప్పుడు మొక్క మొదళ్ళలో ఉన్న శాఖలు పసుపు రంగుకు మారి, ఎండిపోతాయి. తరువాత భూమిపై ఉన్న కాండం మీద తెల్లటి బూజు ఏర్పడుతుంది. ఊడలు, కాయలు కూడా తెగులుకు లోనై, గింజలపై మచ్చలు ఏర్పడుతాయి. మొక్కను పీకినప్పుడు కేవలం పైభాగాలు మాత్రమే ఊడి వస్తాయి. తెగులును పొలంలో గమనించినప్పుడు హెక్సాకొనజోల్ 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మొదలు తడిచేటట్లు పిచికారి చేయాలి. పూత దశలో ఎకరాకు 200 కి. జిప్సం వేసినట్లయితే తెగులు ఉధతిని తగ్గించవచ్చు.
డా|| యం. కృష్ణ తేజ్, డా|| పి. గణేష్ కుమార్, ఆర్. ప్రసన్న లక్ష్మి , జిల్లా ఏరువాక కేంద్రం, కలికిరి, చిత్తూరు జిల్లా, ఫోన్ : 8008500320