ఆవులలో (తరుపుల్లో) యుక్తవయస్సు ఎంతకాలం ?

- 12 - 18 నెలలు

ఎనుముల్లో (పడ్డల్లో) యుక్తవయస్సు ఎంత కాలం?

- 30 - 36 నెలలు

ఆవుల్లో ఎద ఎన్ని రోజులకు ఒక్కమారు వచ్చును?

- ప్రతి 19 రోజులకు

ఆవుల్లో చూలుకట్టిన తరువాత ఎంతకాలమునకు ఈనును?

- 9 నెలల 9 రోజులకు

ఎనుముల్లో ఎద ఎన్ని రోజులకు ఒక్కమారు వచ్చును?

- ప్రతి 21 రోజులకు

ఎనుముల్లో చూలు కట్టిన తరువాత ఎంతకాలమునకు ఈనును?

- 10 నెలల 10 రోజులు

పశువు ఈనిన తరువాత ఎంత కాలమునకు ఎదకు వచ్చును?

- 45 రోజులకు

ఆవులలో ఎదకు వచ్చినచో ఎన్నిగంటలు ఉండును?

- 12 - 36 గంటలు

ఎనుముల్లో ఎద వచ్చినచో ఎన్ని గంటలు ఉండును?

- 24 గంటల నుండి 48 గంటలు

ఎదకు వచ్చిన పశువుకు ఎప్పుడు ఎద సూది వేయించాలి?

- ఉదయం ఎదకు వచ్చినట్లయితే సాయంత్రం, లేక సాయంత్రం ఎదకు వస్తే మరుసటిరోజు ఉదయం అనగా 12 గంటల నుండి 36 గంటల్లో ఎద సూది వేయించాలి.

మా పశువుకు 5 - 6 మార్లు ఎద సూది వేయించినూ చూలు నిలుచుట లేదు కారణం తెలుపుము?

సాధారణంగా 100 పశువులకు శాస్త్రీయంగా ఎద సూదులు వేస్తే 25-30 పశువులు మాత్రమే ఈనును.

పశువు యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండవలెను.

ఎదకు వచ్చిన పశువు ఎద సూది వేసిన వైద్యులు మరియు కత్తిమ గర్భధారణ పరికరాలు పరిశుభ్రంగా ఉండాలి.

పశువులు బెదరక ఉండి భీతి లేకుండా శాంతంగా ఉండవలెను.

సరైన ఎద లక్షణాలు గుర్తించి మధ్య నుండి చివరి ఎదలో కృత్రిమ గర్భధారణ చేయించవలెను.

ఎదకు వచ్చిన పశువును డాక్టర్‌ గారు పరీక్షించి సరైన సమయం సూచించినట్లయితే ఆ ప్రకారం ఎద సూది వేయించవలెను.

ఎద సూది వేయు వైద్యులు సరైన గర్భాశయ ప్రదేశంలో ఎద సూది వేయవలెను.

మొదటిసారి మరియు రెండవసారి కతిమ గర్భధారణ చేయించిననూ, చూలు నిలువని యెడల పశు వైద్యునిచే గర్భాశయమును పరీక్షింప జేసి తగిన చికిత్స చేయించ వలెను.

మా పశువు 5 సంవత్సరాల వయస్సు దాటినది అయినప్పటికీ ఇంత వరకు ఎదకు రావడం లేదు కారణం తెలియజేయగలరు?

పశువు యుక్త వయస్సు (కట్టు ప్రాయము) ఆవుల్లో 12 - 18 నెలలు, ఎనుముల్లో 30 - 36 నెలలు శరీర బరువు కనీసం 250 కిలోలు ఉండవలెను.

తరుపులు లేక పెయ్యలు పుట్టిన 2.1/2 నెలల నుండి దూడల దాణాను తినిపించక లవణ మిశ్రమముతో కూడిన పౌష్టిక ఆహారం యివ్వకపోవుట వల్ల.

పుట్టిన నెల నుండి కనీసము 6 నెలల వరకు నట్టల నివారణ మందులు తాగించక పోవుట వల్ల.

విటమిన్లు, శార్క్‌ లివర్‌ ఆయిల్‌ ఆహారంలో లోపించుట వల్ల

పైన తెలిపిన విషయాలు పాటించక పోవుట వల్ల గర్భాశయం శరీర బరువుతో పాటు సక్రమంగా అభివద్ధి జరుగకపోవుట వల్ల ఎదకు రాదు.

అందుకుగాను వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి గర్భాశయం యొక్క పునరుత్పత్తి పరిస్థితిని పరిశీలించ వలెను. ప్రతి దినం 30 గ్రా. ఎముకల పొడి, 1/4 కే.జి. ఉలవలు గాని, పెసలు గాని, శెనగలు కాని మొలక కట్టి ఉదయం, సాయంత్రం దాణాలో పెట్టవలెను. మిటమిన్లు, సూదులు కనీసం 8 దినములు వేయించవలెను.

మా ఎనుముకు కావాలసినంత మేపు, దాణా పెట్టినా కూడా 2.1/2 నుండి 3 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. పాలు అభివద్ధి కావలెనంటే ఏమి చేయాలి?

- సాధారణంగా మన జిల్లాల్లో ఎక్కువ శాతం దేశవాళి పశువులు కలిగి ఉన్నాము. నాటు ఎనుములు 2 - 3 లీ. పాలు మాత్రమే ఇచ్చును. ఈ దేశవాళి పశువుకు అధిక దిగుబడినిచ్చే పాలసార గలిగిన ఆబోతు యొక్క వీర్యంతో కత్తిమ గర్భధారణ చేయించినట్లయితే దానికి పుట్టిన సంకరజాతి పెయ్య 30 - 36 నెలలో అనగా మూడు సంవత్సరాల్లో ఎదకు వచ్చును. దానికి కత్తిమ గర్భధారణ చేయించినట్లయితే 10 నెలలకు ఈనును. దానికి 8-10 లీ. పాల దిగుబడి జరుగును. ఈ విధంగా అన్నీ దేశవాళి గేదెలకు ముర్రాజాతి ఆబోతు వీర్యంతో కత్తిమ గర్భధారణ చేయించుకుంటే 4-5 సంవత్సరాల్లో పాల వెల్లువ జరుగును.

మా గ్రామము పశు వైద్యశాలకు 10-15 కి.మీ. దూరంలో ఉంది. మా పశువులు ఎదకు వచ్చునప్పుడు ఆసుపత్రికి తీసుకొచ్చి ఎదసూది వేయించాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. పశువులకు రోగాలు వచ్చినా ఇబ్బందిగా ఉంది. దానికి పరిష్కార మార్గం చూపించండి.

ఇందు కొరకై మారుమూల గ్రామాలు అంటే పశువైద్యశాలకు 10-15 కీ.మీ. దూరంలో ఉన్న గ్రామాల్లో ఉన్న 10వ తరగతి పాసైన నిరుగ్యోగ యువకులను సర్పంచి ద్వారా ఎంపిక చేసి వారికి 4 నెలలు కత్తిమ గర్భధారణలో, ప్రాధమిక చికిత్సలోనూ విశాఖట్నం, కాకినాడ, గన్నవరం, రెడ్డిపల్లె మొదలగు ప్రాంతీయ శిక్షణా కేంద్రాలలో ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ యివ్వబడుతుంది. వీరిని ''గోపాలమిత్రలు'' అందురు. ప్రతి 4, 5 గ్రామాలకు ఒక గోపాల మిత్ర పశుగణాభివద్ధి సంస్థ ద్వారా నియమించబడును. గోపాలమిత్రులు స్వయం ఉపాధితో పశుసేవ చేసి రైతుల నుండి తగు ఆర్థిక సహాయం పొందవలెను. రైతులు కత్రిమ గర్భధారణ గోపాలమిత్రునిచే చేయించుకొన్నట్లయితే ప్రతి ఎద సూదికి రూ. 40/- చొప్పున రుసుము చెల్లించవలసి ఉంటుంది.

ఎద సూది ద్వారా పుట్టిన దూడలు సైజు పెద్దదిగా ఉండుట వల్ల ఈనేటప్పుడు పశువు కష్టపడును. ఒక వేళ దూడలు ఈనినప్పటికీ దూడలు చనిపోవుచున్నవి. దీనికి పరిష్కారమేమిటి?

ఎదసూది వేసిన తరువాత 3 నెలలకు చూలు పరీక్ష చేయించి, చూలు నిర్ధారణ అయినప్పటి నుండి ఈనినంతవరకు పశువుకు మామూలు కంటే రెండింతలు పౌష్టికాహారంతో కూడిన దాణా మరియు ఖనిజ లవణాలు, పచ్చిమేత అందించాలి. అందువల్ల పశువు ఈనే సమయానికి మక్కి ఎముకలు విశాలంగా పెంచి పెద్దదైన దూడ సులభంగా గర్భం నుండి బయటకు వచ్చును. దూడలు పుట్టిన వెంటనే 4-5 రోజుల వరకు జన్ను పాలు తాగించవలెను. జన్ను పాలను త్రాగించుట వల్ల దూడకు భవిష్యత్తులో వ్యాధి నిరోధక శక్తి పెరుగును. మరియు మిటమిన్‌ 'ఎ' పుష్టిగా ఉండుట వల్ల కంటి జబ్బులు రావు, దానితోపాటు దూడలకు గరాÄ్భశయం అభివద్ధి చెందును. దూడ పుట్టిన 10 రోజులకు తప్పనిసరిగా నట్టల నివారణ మందును తాగించవలెను. మరలా డాక్టరు సలహాతో నట్టల నివారణ మందు షెడ్యూలు ప్రకారం తాగించినట్లయితే కడుపులో ఉన్నటువంటి పురుగులు నశించి దూడ బలంగా ఆరోగ్యంగా ఉండి బలంగా పెరుగును. అలాకాక దూడ తొందరగా కట్టు ప్రాయానికి వచ్చును.

దూడల పోషణలో జాగ్రత్తలను మాకు వివరించండి?

పశువుకు చూలు నిర్ధారణ జరిగినప్పటి నుండి అనగా 3వ నెల నుండి పౌష్టిక ఆహారం, ఖనిజ లవణాలు, పచ్చిమేత క్రమంగా పశువు ఈనే వరకు పశువైద్యుని సలహా మేరకు షెడ్యూలు ప్రకారం ఇచ్చినట్లయితే దూడ ఆరోగ్యంగా, బలంగా పెరుగును.

దూడ తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన వెంటనే ముక్కు ద్వారము కన్నుల పైనున్నటువంటి మావి పొరలను పొడిగుడ్డతో తుడుచుటవలన దూడ గాలి పీల్చుకొని త్వరగా లేచి నిలబడును. అటు పిమ్మట - బొడ్డును 4 సెంటి మిటర్ల దూరంలో దారంతో కట్టిన తరువాత కొత్త బ్లేడుతో కత్తిరించి వెంటనే టింక్చర్‌-అయోడిన్‌ పూయవలెను.

దాని తరువాత కాలి గిట్టలు గిల్లవలెను.

దాని తరువాత వెంటనే అంటే ఈనిన 1/2 గంట లోపలే తల్లి చనులు దూడ యొక్క నోటికి అందించి పాలు తాపించాలి. ఈ విధంగా 4-5 రోజుల వరకు తప్పని సరిగా దూడ తప్తిగా తాగినంత వరకు జన్ను పాలు తాగించాలి.

ఈనిన 10వ రోజు దూడకు నట్టల నివారణ మందును తప్పక తాపించాలి.

దూడకు నట్టల నివారణ మందును ఏవిధంగా తాపించాలి?

దూడ పుట్టిన 10 రోజులకు పైపరిజిన్‌ అడిపేటు 5 గ్రా.(లేక) పైపరిజన్‌ హైడ్రేట్‌ 5 మి.లీ. తాపించవలెను.

దూడ వయస్సు 20వ రోజు మరల 30వ రోజున పైపరిజన్‌ అడిపేటు 5 గ్రా (లేక) పైపజన్‌ హైడ్రేట్‌ 5 మి.లీ. తాపించాలి.

రెండవ నెలలో అనగా 45 రోజులకు మరియు 60 రోజులకు 2 సార్లు సైపరిజిన్‌ అడిపేట్‌ 10 గ్రా (లేక) పైపరిజిన్‌ హైడ్రేట్‌ 10 మి.లీ. తాపించవలెను.

మూడవ నెలనుండి 5వ నెల వరకు అల్బెండజోల్‌ 25 గ్రా. మాత్రలు నెలకు ఒకసారి ఇవ్వాలి.

6వ నెల తరువాత 3 నెలలకు ఒక మారు ఫెన్బండజోల్స్‌ 5 గ్రా. సంవత్సరం వయసు వరకు ఇవ్వాలి.

దూడలకు దాణా షెడ్యూలు గురించి చెప్పండి?

దూడ వయసు 2.1/2 నెలలో 50 గ్రా. దూడల దాణాను తినిపించాలి రోజుకు. ఈ విధంగా 3వ నెల వరకు దాణాను అలవాటు చేస్తూ దూడను తల్లి నుండి వేరుచేసి పాలు త్రాగుట మరిపించాలి.

3వ నెల నుండి 4వ నెలవరకు 150 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

4వ నెల నుండి 5వ నెల వరకు 200 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

5వ నెల నుండి 6వ నెల వరకు 250 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

6వ నెల నుండి 7వ నెల వరకు 300 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

7వ నెల నుండి 8వ నెల వరకు 400 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

8వ నెల నుండి 9వ నెల వరకు 450 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

9వ నెల నుండి 10వ నెల వరకు 500 గ్రా. చొప్పున ప్రతి రోజు ఇవ్వాలి.

11వ నెల నుండి 12వ నెల వరకు 750 గ్రా. చొప్పున ప్రతి రోజు దాణాతో పాటు విటమిన్‌ 'ఎ' మరియు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి.

దూడలకు వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూలు కార్యక్రమం గురించి చెప్పండి.

2.1/2 నేలల వయసులో గాలికుంటు టీకాను వేయించాలి.

5.1/2 నెలల వయసులో మరల బూస్టర్‌ డోసు టీకా వేయాలి.

6 నెలల వయసు పైబడిన తరువాత గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి.

15-20 రోజుల తరువాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలి. పై విధంగా దూడలను పరిరక్షించగలినప్పుడు ఈ నాటి లేగ దూడలు రేపటి పాడి పశువులుగా అభివద్ధి చెంది పాలవెల్లువ జరిగి రైతు యొక్క ఆర్థిక స్థోమత పెరిగి కరవు కాటకాలను అధిగమించగలడు.

పరిశుభ్రమైన పాలు ఉత్పత్తి పద్ధతులు గురించి చెప్పండి.

పాడి పశువులున్న పాకలు పాలు పితుకుటకు అరగంట ముందుగా పేడ ఎత్తివేసి పరిశుభ్రంగా నీటితో కడగాలి.

తరువాత పాడి పశువులను మంచినీటితో వీపుపైన, పొదుగు పైన, తల పైన, తోక కుచ్చులను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో పొదుగును, చనులను తేమ లేకుండా శుభ్రంగా తుడవాలి.

పాలు పితుకు వ్యక్తికి జలుబు గాని, టి.బి. గాని అనగా మనిషి నుండి పశువులకు - పశువుల నుండి మనుషులకు సోకే వ్యాధులు ఉండకూడదు. అనగా ఆరోగ్యవంతంగా ఉండాలి, వ్యక్తి స్నానం చేసి పొడి బట్టలు ధరించి ఉండాలి.

పాలు పితికేటటువంటి పాత్రలు పరిశుభ్రంగా ఉండాలి. ఇందుకు గాను పాత్రలను శుభ్రంగా సోడా పొడితో కడిగి తిరిగి మంచి నీటితో కడిగి పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి.

ఉదయం పాలు పిండుకొనుటకు వీలుగా మందురోజు సాయంత్రం పాత్రలను కడిగి శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచాలి. ఉదయం శుభ్రం చేసి ఆరబెట్టిన పాత్రలను సాయంత్రం పాలు పిండుకొనునప్పుడు వాడాలి.

పిండిన పాలను ఒక 1/2 గంట వరకు చల్లని ప్రదేశంలో పతలా గుడ్డను కప్పి ఉంచవలెను. ఈ విధంగా చల్లబరచిన యెడల పాలలోని వెన్న పైభాగం చేరును. పైనున్న పాలను విక్రయించినట్లయితే అధిక ధర వచ్చును. అడుగుననున్న పాలను ఇంటికి వాడుకోవచ్చు.

దేశవాళి పశువు కంటే సంకరజాతి పశువు ఏవిధంగా మెరుగు లేక ఉత్తమం.

దేశవాళి పశువులు ఆవులు :

3-4 సంవత్సరం వయసులో ఆవులు మొదటిసారి ఎదకు వచ్చును.

4 సంవత్సరాల, 5 సంవత్సరాల వయసులో మొదటి ఈత ఈనును.

ఈతకు - ఈతకు మధ్య కాలం 2 సంవత్సరాలు

ఈతలో 200 రోజులు మాత్రం పాలు ఇచ్చును.

సరాసరి 2 లీటర్లు మాత్రం పాల దిగుబడి ఉండును.

సంకరజాతి పశువులు - ఆవులు :

12 - 18 నెలలోనే మొదటి సారి ఎదకు వచ్చును.

2 1/2 సం|| లోపల మొదటి ఈత ఈనును.

ఈతకు- ఈతకు 12-14 నెలలు మాత్రమే మధ్యకాలం ఉండును.

305 రోజులు పాల దిగుబడి ఉండును.

8 - 10 లీటర్లు పాల దిగుబడి ఉండును.

పాడి పోషణ లాభసాటిగా ఉండాలంటే తగు సూచనలు చెప్పండి?

మేలుజాతి - పశువులనే ఎంపిక చేసుకోవలెను.

పాడి పశువులు సకాలంలో ఎదకువచ్చి చూలుకట్టేటట్లు - వాటి పునరుత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవలెను.

ప్రతి సంవత్సరంలో ఈనేటట్లు పునరుత్పత్తి యాజమాన్యంలో తగు మెళుకువలు పాటించవలెను.

చూలు పశువుల పోషణలో శ్రద్ధ చూపాలి.

పెయ్య దూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులను పాటించి అవి ఆరోగ్యంగా, త్వరగా పెరిగేట్లు చూచుకోవలెను. పెయ్యలు సకాలంలో ఎదకు వస్తున్నాయా లేదా అని గమనించవలెను.

పాడి పశువులకు - వాటి ఉత్పత్తికి తగినట్లుగా మేపు అందించవలెను.

పచ్చి మేతలు సాగు చేసుకొని పశువులకు మేపాలి. మేత వధా కాకుండా చర్యలు తీసుకోవలెను.

పాల ఉత్పత్తిలో ఖర్చులు తగ్గించి నాణ్యమైన పాల ఉత్పత్తిచేసి గిట్టుబాటు ధరలో అమ్ముకోవాలి.

పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి సోకినట్లు ముందుగా గుర్తించడం ఎలా?

అనుమానం ఉన్నప్పుడు స్ట్రిప్‌ కప్పులను వాడాలి. అంటే ఒక చిన్న కప్పులాంటి గిన్నెకు నల్లటి బట్ట కట్టి దానిపై ముందుగా రెండు, మూడు ధారల పాలు పిండితే ఆ పాలల్లో ఉండే అసాధారణమైన పదార్థాలను గుర్తించవచ్చును. ఈ విధంగా నాలుగు సన్నులలో వచ్చే పాలను పరీక్షించాలి. ఏ విధమైన కలుషితాలుఉన్నా ఆపాలను మంచి పాలలో కలుపరాదు. ఒకవేళ కలిపితే మొత్తంపాలు చెడిపోయే ప్రమాదముంది. నల్లటిబట్టపైన కనబడే అపరిశుబ్రాలు మరియు అసాధారణ పదార్థాలు ముఖ్యంగా గడ్డలు కట్టిన పాలు, చీము, రక్తపు చారులు కల్గిన పాలు ఈ నల్లటి బట్టపై పిండిప్పుడు సులభంగా గుర్తించవచ్చు. దీనినిబట్టి పశువు అనారోగ్యంతో, పొదుగు వాపు వ్యాధితో ఉందని గుర్తించాలి. అలాంటి పశువుల పాలను మిగతా పాలతో కలుపరాదు. అనారోగ్యపాలను పారబోయాలి. దూడలకు తాపటం కూడా చేయరాదు.

పొదుగువాపుకు సంభందించి ఇంటి దగ్గర చేసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా?

చేయు విధానం : (ఇళ్ళలో వాడుకునే సర్ఫ్‌తో పరీక్ష చేయుట )

ముందుగా సర్ఫ్‌ ఎక్సెల్‌ 5-6 చెంచాలు తీసుకొని అర లీటరు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక ప్లాస్టిక్‌ సీసాలో భద్రపరచుకోవచ్చు. 3 నెలల వరకూ నిల్వ ఉంచుకోవచ్చు. సీసాను వెలుతురు తగలని చోట జాగ్రత్త చేయాలి.

పరీక్ష చేయవలసిన పాడిపశువు నుండి పాలను సేకరించాలి. నాలుగు చనుకట్ల నుండి పాలను విడివిడిగా సేకరించాలి. ఒక చిన్న ప్లాస్టిక్‌ గ్లాసులో 10 మి.లీ పాలను తీసుకొని 10 మి.లీ . సర్ఫ్‌ నీళ్ళను కలపాలి. 1 0 సెకండ్ల సేపు నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని కలపాలి. పొదుగువాపు వ్యాధి ఉన్నట్లయితే ఆ మిశ్రమం ముద్దగా అయిపోతుంది. వ్యాధిలేనట్లయితే ఏమి మార్పు రాదు.

దీన్ని కనీసం వారానికి ఒకసారైనా చేస్తూ ఉన్నట్లయితే పొదుగు వాపు వ్యాధిని ఆదిలోనే గుర్తించి సరైన సమయంలో చికిత్స చేసుకోవచ్చు, మన పాడిపశువులను ఈ వ్యాధిబారి నుండి కాపాడుకోవచ్చు.

అయ్యా! పాలలో వెన్నశాతం పెరగాలంటే ఏమి చేయాలి?

ముందుగా మనం పచ్చిమేతను అందించాలి.

మరల పోషక విలువలు ఉండే దాణా ను వాడాలి.

ఎముకల పొడిని అగ్గిపెట్టె మూతలో సరిపడా ఉదయం, సాయంత్రం ఇవ్వాలి.

వేరుశనగ కేకు మరియు పత్తి గింజలకేకులను 250 గ్రా. చొప్పున వారంపాటు ఉపయోగించాలి.

-

డా|| గానుగపెంట రాంబాబు,పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు,

కడప, ఫోన్‌ : 9618499184