మొక్కజొన్నలో ప్రోటీన్లు, ఎమినో ఆమ్లాలు కలిగి ఉండే చక్కని ధాన్యపు పంట. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న సుమారు 90 వేల హెక్టార్లలో సాగవుతున్నది. మొక్కజొన్న పంటకు ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఇటు ఖరిఫ్‌ అటు రబీ కాలంలో ఎక్కువగా ఆశించి నష్ట పరుస్తుంది. కాని ఈ పురుగు కంటే ప్రమాదకారి అయిన ''కత్తెర పురుగు'' ప్రస్తుతం మొక్కజొన్నకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పండించే అన్ని జిల్లాల్లో కూడా కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలియ చేస్తున్నారు. ఈ కత్తెర పురుగు సాధారణంగా మొక్కజొన్నను ఆశించే మొవ్వు పురుగు కన్నా భిన్నంగా ఉంటుందని, రైతులు గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. లేనిఎడల దీని ఉధతి మిగతా పంటల మీద కూడా ఉండి భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాసం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు.

ఫాల్‌ ఆర్మీ వార్మ్‌గా పిలువబడే ఈ పురుగు శాస్త్రీయ నామం స్పోడోప్టిర ఫ్రుగిపెరాడ. ఇది లేపిడాప్టిరా జాతికి చెందిన పురుగు. ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న పంటను ఆహారంగా తీసుకుంటుంది. మొక్కజొన్నను ఎక్కువగా పండించే అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ పురుగు ఉధతి ఎక్కువ. తల్లి రెక్కల పురుగు ఎక్కువ దూరం ప్రయనించగలిగే శక్తి ఉండటం వల్ల ఇది సుదూర ప్రాంతం ప్రయాణం చేసి ప్రస్తుతం భారత దేశంలోని కర్ణాటకలో దీని ఉధతి మొదట కనుగొన్నారు. తరువాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పురుగు ఆశించినట్లు గుర్తించడం జరిగింది.

ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న మీద ఆశించి నష్ట పరుస్తుంది. మొక్కజొన్న లేనప్పుడు ఇతర పంటల మీద ఆహారంగా తీసుకుంటుంది. వరి, పత్తి, అపరాలు, సోయా, జొన్న, కూరగాయలు వంటి 80 రకాల పంటలపై ఈ పురుగు ప్రభావం చూపుతుంది.

జీవిత చక్రం :

కత్తెర పురుగు జీవిత చక్రం నాలుగు దశల్లో (గుడ్డు, లద్దె పురుగు, కోశస్థ దశ, రెక్కల పురుగు) 30 నుండి 35 రోజులు ఉంటుంది.

గుడ్డు దశ :

తల్లి రెక్కల పురుగు లేత గోధుమ రంగు కలిగిన గుడ్లను, సమూహంగా 150-200 గుడ్లు ఒక్కసారిగా ఆకుల మీద పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లకు రక్షణగా గుడ్ల పై పొరను కప్పి ఉంచుతాయి. ఈ గుడ్లు 2-3 రోజుల్లో పగిలి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఒక్కఆడ తల్లి పురుగు జీవిత కాలంలో సుమారు 1500-2000 వరకు గుడ్లు పెట్టగలవు.

లద్దె పురుగు :

లద్దె పురుగు ఆరు దశలు కలిగి ఉంటుంది. లద్దె పురుగు పిల్ల దశలో లేత పచ్చ వర్ణంలో ఉండి, పెరిగిన కొద్ది గోధుమ వర్ణం నుండి బూడిద రంగుకు మారతాయి. కోశస్థ దశకు చేరుకునే సరికి ముదురు గోధుమ వర్ణం నుండి నలుపు వర్ణంలో కూడా ఇవి కనిపిస్తాయి. మూడవ దశకు చేరిన లద్దె పురుగు తల మీద తిరగబడిన '్‌' ఆకారంలో పసుపు చారలు ఉంటాయి. పురుగు చివరి ఖండితంలో చతురస్రాకారంలో నాలుగు నల్లటి చుక్కలు మధ్యలో రోమం కలిగి ఉంటాయి. సుమారు 14-16 రోజులలో లద్దెపురుగు కోశస్థ దశకు చేరుకుంటుంది.

కోశస్థ దశ :

బాగా ఎదిగిన లార్వా, లద్దె పురుగు దశ ముగించుకుని కోశస్థ దశకు చేరుకుంటుంది. ముదురు గోధుమ వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. ఎక్కువగా నేలలో ఈ దశలో ఉంటుంది. సుమారు 8-12 రోజులు కోశస్థ దశలో ఉంటుంది.

రెక్కల పురుగు :

ఆడ రెక్కల పురుగు పై రెక్కల మీద పూర్తిగా గోధుమ మరియు బూడిద వర్ణం మచ్చలు ఉంటాయి. లోపలి రెక్కలు గడ్డి రంగులో ఉండి, గోధుమ వర్ణపు అంచులు కలిగి ఉంటాయి. మగ రెక్కల పురుగు పై రెక్కలు గోధుమ, బూడిద మరియు గడ్డి రంగులో ఉండి, లేత గోధుమ రంగులో మచ్చలు కలిగి ఉంటాయి. రెక్కల పురుగు జీవిత కాలం 10-21 రోజులు.

నష్ట పరిచే విధానం :

ఈ పురుగు యొక్క రెక్కల పురుగు గుడ్లు పెట్టడం వల్ల, గుడ్లు పగిలి పిల్లలుగా మారిన లద్దె పురుగులు గుంపులుగా ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తింటాయి.

రెండవ దశలో ఈ పురుగులు కాండం మొవ్వులో చేరి లోపల కాండాన్ని తింటాయి. ఆకుల మీద పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి.

శాఖీయ దశలో ఆశించినప్పుడు మొవ్వును పూర్తిగా తినడం వల్ల మొవ్వు చనిపోయే ప్రమాదముంది. పురుగు తిని విసర్జించిన మల పదార్ధంతో మొవ్వంతా నిండి ఉంటుంది.

పూత మొదలయ్యే సమయంలో ఆశిస్తే మొవ్వు లోపల ఉన్న పూతను కూడా రంధ్రాలు చేసి నష్ట పరుస్తాయి. పూత చనిపోయి కంకి తయారు అవ్వదు.

కంకి తయారయ్యే సమయంలో కూడా ఈ పురుగు ఆశించి కంకులను తిని నష్ట పరుస్తుంది.

ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న పంటను ఆశిస్తుంది. పంట లేనప్పుడు వరి, జొన్న, చెరకు, పత్తి, కూరగాయలు వంటి ఇతర 80 రకాల పంటల మీద కూడా తిని బ్రతుకుతుంది.

నివారణ :

సమగ్ర సస్య రక్షణ విధానం (Iఅ్‌వస్త్రతీa్‌వస ూవర్‌ వీaఅaస్త్రవఎవఅ్‌) ద్వారా ఈ పురుగును నియంత్రిచాల్సిన అవసరం ఉంటుంది.

ఆలస్యంగా విత్తుకునే పంటలో ఈ పురుగు ఉధతి ఎక్కువ కనుక మొక్కజొన్న సాగు చేసే రైతులు సకాలంలో జూన్‌ నెలలో విత్తుకుంటే మంచిది.

మొక్కజొన్నలో అంతర పంటగా లేదా చుట్టూ కంచెగా నాపియర్‌ గడ్డిని వేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధతి తగ్గుతుంది.

ప్రతి రెండు మూడు రోజులకు పొలాన్ని పరిశీలించి పురుగు గుడ్లు, లేదా పిల్ల పురుగుల సమూహాలు కనిపిస్తే ఏరి నాశనం చేయాలి.

అక్షింతల పురుగు, ఆరుద్ర పురుగు వంటివి ఈ పురుగు పరాన్న భుక్కులుగా పనిచేస్తాయి కనుక పొలంలో వీటి సంతతిని పెంచాలి.

ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను ఎకరానికి 20000 గుడ్లు చొప్పున ట్రైకో కార్డుల ద్వారా రెండు సార్లు పొలంలో వదలాలి.

కొటేసియా, టేలోనిమాస్‌ వంటి గుడ్డు పరాన్న జీవులను కుడా వాడుకోవచ్చు.

బి.టి. ఫార్ములేషన్‌ లీటరు నీటికి 2 గ్రా. చొప్పున కలిపి పురుగు ఉధతి గమనించిన వెంటనే పిచికారి చేయాలి. నుమరియ రిలేయి వంటి శిలీంద్ర జాతికి చెందిన జీవ రసాయనం వాడి కూడా పురుగును అదుపు చేయవచ్చు.

మూడవ దశ లద్దె పురుగులను ఆకర్షించడానికి విషపు ఎరలను సాయంత్రం వేళలో పొలంలో ఉంచాలి. విషపు ఎర తయారీకి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం కలిపి ఒక రాత్రంతా పులియబెట్టి, దానికి 500 మీ.లీ. మోనో క్రోటోఫాస్‌ లేదా థయోడి కార్బ్‌ మందును కలిపి ఉండలుగా చేసి పొలం లో ఉంచాలి.

ఈ పురుగు ఉధ తి ఎక్కువగా ఉంటె, నివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5 శాతం 80 గ్రా. లేదా స్పైనోసాడ్‌ 45 ూజ 60 మీ.లీ. ఎకరానికి 200 లీ నీటికి కలిపి పిచికారి చేయాలి.

పురుగు ఉధతి తీవ్రతరం అయినప్పుడు, లామ్డా సైహలోత్రిన్‌ 20 శాతం జుజ మందు 200 మీ.లీ. మందును ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మందు పిచికారి చేసేటప్పుడు మొవ్వు సుడులలో పడే విధంగా పిచికారి చేస్తే పురుగు నివారణ సాధ్యమవుతుంది.

డా|| జి. చిట్టిబాబు, శాస్త్రవేత్త (సస్యరక్షణ), డా|| వెంకట్రావు, శాస్త్రవేత్త (విస్తరణ), డా|| డి. చిన్నం నాయుడు, కార్యక్రమ సమన్వయ కర్త,

ఏరువాక మరియు కషీ విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, ఫోన్‌ : 9849035068